శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 జులై 2014 (12:38 IST)

కనుమూరి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి: మాణిక్యాల రావు

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి మాణిక్యాల రావు తెలిపారు. రాజీనామా చేయాలని బహిరంగంగా కోరినా ఆయనలో స్పందన లేవట్లేదన్నారు. త్వరలోనే ఆన్‌లైన్లలో టీటీడీ రూ.300 దర్శనం టికెట్లకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
 
ఆన్‌లైన్ బుకింగ్ అమలులోకి రాగానే వీఐపీ టెకెటింగ్‌ను రద్దు చేస్తామని తెలిపారు. తిరుమలలో వీఐపీ దర్శనాలు ఉండొద్దనేది తమ అభిప్రాయన్నారు. దేవాలయాల భూములు అన్యాక్రాంతం కానివ్వమన్నారు. ప్రధాన దేవాలయాల్లో ఎన్టీఆర్ సుజల పథకం అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. 
 
కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి నుంచి ఇక తప్పుకుంటే మేలని మాణిక్యాల రావు కొద్ది రోజుల క్రితం చెప్పిన సంగతి తెలిసిందే.