గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Preeti
Last Modified: మంగళవారం, 18 జులై 2017 (13:07 IST)

ఆన్‌లైన్ చోరీలకు ఆధార్ ఆధారమవుతుందా?

వినియోగదారుల సౌలభ్యం కోసం బ్యాంకులు రూపొందిస్తున్న వివిధ సాంకేతికతలు వారి పాలిట శాపంగా, దొంగలకు వరంగా మారుతున్నాయి. ఇటీవల అన్ని బ్యాంక్‌లు ఆధార్ కార్డ్‌ను తప్పనిసరిగా లింక్ చేయాల్సిందిగా కోరుతున్న సంగతి తెలిసిందే. కానీ సమయం లేకపోవడం వల్లనో లేదా గడువు

వినియోగదారుల సౌలభ్యం కోసం బ్యాంకులు రూపొందిస్తున్న వివిధ సాంకేతికతలు వారి పాలిట శాపంగా, దొంగలకు వరంగా మారుతున్నాయి. ఇటీవల అన్ని బ్యాంక్‌లు ఆధార్ కార్డ్‌ను తప్పనిసరిగా లింక్ చేయాల్సిందిగా కోరుతున్న సంగతి తెలిసిందే. కానీ సమయం లేకపోవడం వల్లనో లేదా గడువు ఏమీ ఇవ్వలేదు కదా అనో కొంతమంది తర్వాత చేద్దాంలే అనుకుంటున్నప్పుడు మీ ఖాతా వివరాలు లేదా ఎటిఎమ్ కార్డ్ వివరాలు చెప్తే మేము ఆధార్ కార్డ్ లింక్ చేస్తామని కొందరు రంగంలోకి దిగుతున్నారు. 
 
అంతేకాదు... ఇప్పుడు చేయకపోతే మీ కార్డ్ రద్దవుతుందని కంగారు పెట్టి వినియోగదారుల నుండి కావాల్సిన వివరాలు రాబట్టుకుని, డబ్బును మళ్లీ ఇంకో బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేసుకుంటే సులభంగా పట్టుకుంటారని పేటీఎమ్, మొబీక్విక్ వంటి సైట్‌లకు బదిలీ చేసుకుంటున్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి షాపింగ్ సైట్‌లలో వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. బ్యాంక్ ఉద్యోగులు ఎవరూ కాల్ చేసి పిన్‌లు, ఓటిపిలు వంటివి అడగరు, కాబట్టి ఇలాంటి కాల్‌లు వచ్చినప్పుడు మోసపోకుండా, వాటి గురించిన వివరాలతో ఫిర్యాదు చేయండి, మీకు తెలిసినవారికి వీటి గురించి చెప్పండి.