శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2017 (16:50 IST)

నంద్యాల స్థానం మాదే... అభ్యర్థిని ప్రకటిస్తాం... బాబు మాటతో పనిలేదు.. భూమా అఖిల ప్రియ

తన తండ్రి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన స్థానం నంద్యాల. ఇపుడు ఆయన మృతితో ఇక్కడ ఉప ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థే పోటీ చేస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని రాష్ట్ర మంత్రి భూమా అఖిల ప్రియా స

తన తండ్రి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన స్థానం నంద్యాల. ఇపుడు ఆయన మృతితో ఇక్కడ ఉప ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థే పోటీ చేస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని రాష్ట్ర మంత్రి భూమా అఖిల ప్రియా స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరెన్ని చెప్పినా వినే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. 
 
ఆమె బుధవారం భవానీ ఐల్యాండ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమా నాగిరెడ్డి మృతితో నంద్యాల నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉందన్నారు. ఈ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని, ఈ నెల 24వ తేదీన శోభా నాగిరెడ్డి వర్థంతి రోజున అభ్యర్థి ఎవరో ప్రకటిస్తామని తెలిపారు. 
 
పార్టీ అధినేత చంద్రబాబు అనుమతి లేకుండానే నంద్యాల ఉప ఎన్నిక కోసం అభ్యర్థిని ప్రకటిస్తామని భూమా అఖిల ప్రియా రెడ్డి ప్రకటించడం ఇపుడు ఆసక్తిని రేపుతోంది. చంద్రబాబు ఆమెకు హామీ ఇచ్చారా? ఆ ధైర్యంతోనే అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారా? అనే చర్చకు సాగుతోంది.