శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (18:41 IST)

పవన్‌కు భూమా నాగిరెడ్డి థ్యాంక్స్.. విజయానికి కృషి చేశారట!

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌కు వైఎస్ఆర్ సీపీ నేత, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా చొరవుతీసుకుని కృషి చేశారని శుక్రవారం వెల్లడించారు. 
 
కాగా, శోభానాగిరెడ్డి దుర్మరణంతో ఆళ్ళగడ్డ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ సిద్ధమైన విషయం తెల్సిందే. శుక్రవారం నామినేషన్లు ఉపసంహరణ గడువు ముగియడంతో వైకాపా తరపున శోభానాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ మాత్రమే బరిలో మిగిలారు. దీంతో ఆమె ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 
 
అఖిల ప్రియారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి టీడీపీ, కాంగ్రెస్, బీజేపీతో పాటు.. ఇతర పార్టీలన్నీ పోటీకి దూరంగా ఉన్న విషయం తెల్సిందే. దీంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉందని ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి వెల్లడిస్తూ పవన్‌కు అభినందనలు తెలిపారు.