శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 4 జులై 2015 (13:26 IST)

భూమా నాగిరెడ్డికి ఛాతినొప్పి.. హైదరాబాద్ నిమ్స్‌కు తరలింపు

వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి శుక్రవారం ఛాతినొప్పి వచ్చింది. దీంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలగడా ఉన్నట్టు భూమా అనుచరులు వెల్లడించారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలీసు అధికారులను దూషించారంటూ భూమాపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం ఆయనను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. 
 
స్థానిక సంస్థల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రం వద్ద పోలీసులను దూషించడంతో కేసు నమోదైంది. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ డీఎస్పీ దేవదానం ఫిర్యాదు చేశారు. తనను తాకొద్దంటూ భూమా అహంకారం ప్రదర్శించారనీ డీఎస్పీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ పట్ల దురుసుగా ప్రవర్తించిన భూమా నాగి రెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు.