భూమా, గంగుల వర్గీయుల రాళ్ళ దాడి... పలువురికి గాయాలు
కర్నూల్: ఏపీలో ఇపుడు రాజకీయ సమీకరణాలు మారాయి. రణాలూ మారాయి. రెండు రాజకీయ పార్టీలు కొట్టుకునే పనే లేదు. ఎందుకుంటే.. ఆ రెండు పాత్రలూ టీడీపీ నేతలే పోషిస్తున్నారు. తెలుగుదేశంలో వైరి వర్గాల చేరికతో తరచూ సొంత పార్టీలోనే ఘర్షణలు తలెత్తుతున్నాయి. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం, గొడిగానూర్ గ్రామంలో ఒక సిమెంట్ రోడ్డు విషయంలో భూమా, గంగుల వర్గీయులు ఘర్షణ పడ్డారు.
ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. దీనితో ఇరువర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. బాధితులను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, గంగుల నాని విడివిడిగా పరామర్శించారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో భారీగా పోలీసులు మొహరించారు.