శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (16:25 IST)

హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు!

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తమ అధినేత జగన్ నేతృత్వంలో హత్యా రాజకీయాలను ఎదిరిస్తామని... వైకాపా నేతలు, కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పారు.
 
చంద్రబాబు పరిపాలనా కాలమైన 1999 నుంచి 2004 వరకు 400 మంది హత్యకు గురయ్యారని భూమన తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డిని హత్య చేసిన వారికి టీడీపీ ఆఫీసులోనే వసతి కల్పించిన ఘనత చంద్రబాబుదే అని విమర్శించారు.