స్వర్గీయ ఎన్టీఆర్ను 150ల లోతున పూడ్చి పెట్టి... 115 అడుగుల విగ్రహం పెడతావా బాబూ... భూమన ఫైర్
తిరుపతి: తిరుపతిలో జరిగింది మహానాడు కాదు ఆదిమానవుల ఆటవిక జాతర అని వైసీపీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకర రెడ్డి అభివర్ణించారు. ఈ మహానాడులో 150 మంది టీడీపీ నేతలు జగన్ నామస్మరణ చేశారని, జగన్ ప్రతిపక్ష నాయకుడిగా విజయవంతం అయ్యారనడానికి ఇదే నిదర్శనం అన
తిరుపతి: తిరుపతిలో జరిగింది మహానాడు కాదు ఆదిమానవుల ఆటవిక జాతర అని వైసీపీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకర రెడ్డి అభివర్ణించారు. ఈ మహానాడులో 150 మంది టీడీపీ నేతలు జగన్ నామస్మరణ చేశారని, జగన్ ప్రతిపక్ష నాయకుడిగా విజయవంతం అయ్యారనడానికి ఇదే నిదర్శనం అని చెప్పారు. కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీ చర్యలే మాకు శ్రీరామరక్ష అన్నారు. వెంకటేశ్వర స్వామికి వైభవం తీసుకువచ్చింది టీడీపీనే అని చంద్రబాబు అనటం హాస్యాస్పదమని విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ను 150 అడుగుల లోతున పూడ్చిపెట్టి, 115 అడుగులు విగ్రహాన్ని అమరావతిలో పెడతారా అని భూమన ప్రశ్నించారు. సీసీ కెమేరాలను ధైర్యముంటే సీఎం కార్యాలయంలో పెట్టించాలని, మహానాడులో పెడితే ప్రజలకేమి తెలుస్తుందన్నారు. తుని ఘటనపై దమ్ముంటే సీబీఐ విచారణ జరపాలని డిమాండు చేశారు. వంగవీటి రంగా హత్యాకాండ వెనుక టీడీపీ ఉందని హరిరామజోగయ్య చెప్పారని, ఈ ప్రపంచంలోనే చంద్రబాబులా అబద్దాలు చెప్పే నాయకుడు లేడని ఎద్దేవా చేశారు.
జగన్ లేకుండా, ఇక వైసీపీ ఉండదని చంద్రబాబు అనడం అనుమానాలు కలిగిస్తోందని కరుణాకర్ రెడ్డి అన్నారు. జగన్ మోహన్ రెడ్డిని నిర్మూలించటానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారేమోనని అనుమానం కలుగుతోందన్నారు. ప్రజలంతా దీన్ని ఎదుర్కొంటానికి సన్నద్ధంగా ఉండాలన్నారు. వైఎస్ అనుమానాస్పద మృతి వెనుక చంద్రాబు ప్లాన్ చేసి ఉండొచ్చని ఆరోపించారు.