శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 30 ఆగస్టు 2014 (15:12 IST)

స్నేక్ గ్యాంగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: బీజేపీ

స్నేక్ గ్యాంగ్‌పై బీజేపీ ఫైర్ అయ్యింది. హైదరాబాద్‌లోని పాతబస్తీ పహడీ షరీఫ్‌లో ఎన్నో దారుణాలకు పాల్పడిన స్నేక్ గ్యాంగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ, బీజేఎంవై నేతలు డిమాండ్ చేశారు. 
 
ఈ మేరకు బీజేపీ శ్రేణులు గచ్చిబౌలి చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. కాగా, రెండు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు స్నేక్ గ్యాంగ్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. వీరిపై మరో ఐదు కేసులు నమోదు చేశారు. వీరి దురాగతాలపై పోలీసులు సమగ్ర విచారణ చేశారని సమాచారం.