బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 25 మే 2015 (20:27 IST)

నవ్యాంధ్ర రాజధాని రైతుల సమాధులపై కడితే సహించం : మురళీధర్ రావు

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం అవసరమైన భూములను రైతులను ఇబ్బందులకు గురి చేసి సేకరిస్తే మాత్రం తమ పార్టీ సహించబోదని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు హెచ్చరించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... ఏపీ రాజధానిని రైతుల సమాధులపై చేపట్టడం సరికాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
అందరికీ ఆమోదయోగ్యమైన రాజధాని అయితేనే బీజేపీ సాయం చేస్తుందని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ రాజధాని నిర్మించాలని చూస్తే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించదని స్పష్టం చేశారు. సింగపూర్ మంత్రి నుంచి రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ అందుకున్న ఏపీ సర్కారును ఈ వ్యాఖ్యలు ఇబ్బంది పెట్టేవే. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ప్రభుత్వం భారీగా వెచ్చించనుందని చెప్పారు. అయితే, ఎంత ఖర్చు చేసిన రైతులకు హాని కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.