శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (13:03 IST)

చంద్రబాబుతో అమిత్ షా భేటీ-అల్పాహార విందు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. అల్పాహారానికి రావాల్సిందిగా బాబు ఆహ్వానం మేరకు ఈ ఉదయం అమిత్ షా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. 
 
టీడీపీ, బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, ఎల్‌రమణ, ఎర్రబెల్లి, సుజనాచౌదరి, కంభంపాటి, పరకాల ప్రభాకర్ ఈ విందులో పాల్గొన్నారు.
 
కాగా హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా... తన రాక వెనకున్న ఉద్దేశమేంటో స్పష్టం చేశారు. 2019లో జరిగే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జయభేరి మోగించాలని... తెలంగాణ అధికార పీఠంపై కూర్చోవడమే మన లక్ష్యమని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 
 
దక్షిణాదిన బీజేపీ విస్తరణకు తెలంగాణనే నాయకత్వం వహించాలని అన్నారు. తెలంగాణలో ప్రతి గ్రామానికీ బీజేపీ చేరేలా నేతలు, కార్యకర్తలు ఇప్పట్నుంచే శ్రమించాలని అమిత్ షా మార్గనిర్దేశం చేశారు.