అయ్యా జగన్... జైలుకెందుకెళ్లారో చెప్పవయ్యా : మంత్రి బొజ్జల
వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విమర్శల వర్షం కురిపించారు. వైకాపా అధినేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి జైలుకెందుకెళ్లారో చెప్పాలని ఆయన నిలదీశారు.
ప్రధాని మోడీ గాలితోనే చంద్రబాబు గెలిచారన్న జగన్ వ్యాఖ్యలపై స్పందించిన బొజ్జల ఘాటుగానే సమాధానమిచ్చారు. జగన్ జైలుకు ఎందుకెళ్లారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఎన్నికల్లో ఎవరు, ఎవరి గాలితో గెలిచారన్న విషయాన్ని పక్కనబెడితే, అసలు తాను జైలుకెందుకెళ్లారో జగన్ ప్రజలకు వివరించాల్సిన అవసరముందని బొజ్జల వ్యాఖ్యానించారు. జగన్ అవినీతి కారణంగా ఎందరో అధికారులు జైలుకెళ్లాల్సి వచ్చిందనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసని చెప్పారు.