గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 4 మార్చి 2015 (09:40 IST)

టీడీపీ నేత ఇంటిపై బాంబుల దాడి...! తప్పిన ముప్పు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని రూపుదిద్దుకుంటున్న గుంటూరు జిల్లాలో మంగళవారం రాత్రి కలకలం రేగింది. ప్రముఖ టీడీపీ నేత ఇంటిపై ప్రత్యర్థులు బాంబుల వర్షం కురిపించారు. అయితే అదృష్టవశాత్తూ ఆ బాంబులు ఆ నేత ఇంటి వరండాలోనే పడడంతో తృటిలో అపాయం తప్పింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అందరూ గాఢ నిద్రలో ఉండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
 
గుంటూరు జిల్లా నాగిరెడ్డిపాలెంలో జరిగిన ఈ ఘటనలో టీడీపీ నేత సీతారాంరెడ్డి ఇంటిపై ప్రత్యర్ధులు బాంబులు విసిరారు. అయితే, ఆయన బెడ్ రూంలో నిద్రిస్తుండడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు. సీతారాంరెడ్డి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, బాంబులు విసిరిన వ్యక్తుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ సంఘటన అక్కడ కలకలం రేపింది. కాగా పాత కక్ష్యల కారణంగా ఈ దాడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.