శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2016 (12:49 IST)

ఖరీదైన బైక్ కొనుక్కోవాలనుకున్నాడు.. మరో బాలుడ్ని కిడ్నాప్, ఆపై హత్య చేశాడు!

ఖరీదైన బైక్ కొనుక్కోవాలనుకున్న ఓ బాలుడి కల మరో బాలుడి ప్రాణాలను బలిగొంది. తనతో పాటు ఆడుకునే బాలుడిని కిడ్నాప్ చేసి డబ్బులు సంపాదించవచ్చుననే ఆలోచన చివరికి ఆ బాలుడిని హతమార్చేంతవరకు వచ్చింది. అంతేగాకుండా.. గత నెల 17న కరీంనగర్‌లో అదృశ్యమై ఆపై హత్యకు గురైన బాలుడు లక్ష్మీప్రసాద్ కేసులో మిస్టరీ వీడింది. లక్ష్మీప్రసాద్‌ను తోటి స్నేహితుడే హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.
 
వివరాల్లోకి వెళితే కరీంనగర్‌లోని కశ్మీర్‌గడ్డ ప్రాంతానికి చెందిన ఒర్సు కుమారస్వామి కాంట్రాక్టర్. అతడికి ఇద్దరు కుమారులు అనిల్, లక్ష్మీప్రసాద్. లక్ష్మీప్రసాద్ ఇంటి సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. కుమారస్వామి జనవరి 17న శబరిమల వెళ్లగా అదేరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో అతని కుమారుడు లక్ష్మీప్రసాద్ కిడ్నాప్‌కు గురయ్యాడు. 
 
ఆ రోజు భగత్‌నగర్‌లోని ఓ కాయిన్‌బాక్స్ నుంచి బాలుడి తల్లికి ఫోన్ చేసి ‘మీ కొడుకును కిడ్నాప్ చేశాం రూ.5 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తాం' అని బెదిరింపుకాల్ వచ్చింది. దీంతో తమ కుమారుడు కిడ్నాప్ అయ్యాడని తెలుసుకున్న కుమారస్వామి భార్య, బంధువులు నగరంలోని టూ టౌన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీఐ హరిప్రసాద్, ఎస్సై దామోదర్‌రెడ్డి, ఏఎస్సై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. 
 
ఈ కేసు విచారణలో భాగంగా జనవరి 22న మానేరు డ్యాం వద్ద బైపాస్‌రోడ్డులో కుళ్లిపోయిన స్థితిలో లక్ష్మీప్రసాద్ మృతదేహం లభ్యమైంది. బైక్ కొనాలనే ఆశతో బాలుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.