శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 22 ఆగస్టు 2014 (15:52 IST)

జగన్ జైలులో 16 నెలలు చిప్పకూడు తిన్నా బుద్ధి రాలేదు... బుచ్చయ్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా అధికార, ప్రతిపక్ష నాయకులు మాటల దాడికి దిగేశారు. పరస్పర దూషణలు చేసుకున్నారు. ఒకరు హంతకుడు అంటే మరొకరు బఫూన్ అంటూ కడిగేసుకున్నారు. ఇంకా అసెంబ్లీ నడిస్తే ఏమయ్యేదో తెలియదు కానీ, స్పీకర్ కోడెల రేపటికి వాయిదా వేసేశారు. ఐతే జగన్ మోహన్ రెడ్డి బఫూన్ కామెంట్ పై తెదేపా నాయకులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. 
 
జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘాటుగా స్పందించారు. 16 నెలలు జైలులో చిప్పకూడు తిన్న తర్వాత కూడా జగన్ కు బుద్ధి రాలేదని ఆయన తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. జగన్ కు మించిన పెద్ద బఫూన్ ఎవరూ లేరని ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో శాసనసభలో ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు వినలేదని బుచ్చయ్య అన్నారు.