శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (10:46 IST)

'డబ్బులిస్తావా.. చస్తావా'..! యనమల నుంచి బెదిరింపులు..? చంద్రమౌళి ఆరోపన...!

డబ్బులిస్తావా చస్తావా... అంటూ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు, తుని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు తనను బెదిరిస్తున్నారని ప్రియాంక హేచరీ యజమాని గుణ్ణం చంద్రమౌళి ఆరోపించారు. ఈ విషయమై చంద్రమౌళి మాట్లాడుతూ.. హేచరీ నుంచి యనమల కృష్ణుడు భారీగా వసూలు చేసినట్టుగాను, తనను కూడా పది లక్షల రూపాయలు ఇవ్వాలని, లేకుండా చంపేస్తానని బెదిరిస్తున్నట్టు ఆరోపించారు. 
 
ఈ విషయమై తాను తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.  ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. యనమల కృష్ణుడు నుంచి తనకు ప్రాణహాని ఉందని భయాందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగాను, ఎస్పీని కూడా కలిసి, తర్వాత మానవ హక్కుల కమిషన్‌ వద్ద కూడా ఫిర్యాదు ఇవ్వనున్నట్టు చంద్రమౌళి చెప్పారు. 
 
కాగా వాస్తవానికి.. తొండంగి, యు.కొత్తపల్లి మండలం పరిధిలో చాలా వరకూ హేచరీలు అనుమతులు లేకుండా సీఆర్‌జెడ్‌ నిబంధనలను ఉల్లంఘించి నడుపుతున్నట్టుగాను, దీన్ని ఆసరాగా చేసుకుని మంత్రి యనమల సోదరుడు కృష్ణుడు.. హేచరీ యజమానుల నుంచి భారీ ముడుపులు వసూలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దానవాయిపేటలోని ప్రియాంక హేచరీపై దాడి జరగడం గమనార్హం.