ఓటుకు నోటు కేసు... చంద్రబాబులో పెరిగిన ఒత్తిడి... తిరుపతి పర్యటన అర్ధంతరంగా రద్దు
తిరుపతి: ఓటుకు నోటు కేసు ఏపీ సీఎం చంద్రబాబులో ఒత్తిడి పెంచినట్లు కనిపిస్తోంది. ఆయన తన తిరుపతి పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఇక్కడ పర్యటించాల్సి ఉన్నా పర్యటనను తక్షణం రద్దు చేసుకున్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా
తిరుపతి: ఓటుకు నోటు కేసు ఏపీ సీఎం చంద్రబాబులో ఒత్తిడి పెంచినట్లు కనిపిస్తోంది. ఆయన తన తిరుపతి పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఇక్కడ పర్యటించాల్సి ఉన్నా పర్యటనను తక్షణం రద్దు చేసుకున్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది.
కానీ హుటాహుటిన తంబళ్లపల్లి నుంచి హెలికాప్టర్లో బెంగళూరుకు ఆయన బయల్దేరారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరిన సీఎం... నేరుగా రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని తన తాత్కాలిక నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు అనంతపురం జిల్లాలో కూడా చంద్రబాబు పర్యటన కొనసాగాల్సి ఉంది గానీ, అది కూడా రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది.