భిక్షాటన చేసి రాజధాని నిర్మిస్తావా? వాట్ ఈజ్ దిస్: సీహెచ్
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భిక్షాటన చేసి రాజధాని నిర్మిస్తామనడం అవమానకరమని బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. రాజధాని నిర్మాణం కోసం హుండీ పెట్టడం సరికాదని విద్యాసాగర్ రావు అభిప్రాయపడ్డారు.
మంగళవారం విద్యాసాగర్ మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అఖిలపక్ష సమావేశం నిర్వహించి సూచనలు తీసుకోవాలని ఆయన సూచించారు.
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి విరాళాల కోసం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం లేక్వ్యూ వద్ద, సచివాలయంలోని ఎల్ బ్లాక్లో హుండీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.