శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 అక్టోబరు 2014 (11:53 IST)

చంద్రబాబు మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్: చైనా, జపాన్‌ టూర్!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రధాని నరేంద్ర మోడీ ‘మేక్ ఇన్ ఇండియా’ బాటలో పయనించనున్నారు. మేక్ ఇన్ ఇండియాకు మంచి రెస్పాన్స్ రావడంతో మోడీ తరహాలోనే ఏకంగా చంద్రబాబు విదేశీ పర్యటనలకు సిద్ధమై పోయారు. 
 
‘మేక్ ఆంధ్రప్రదేశ్’ పేరిట ఆయన జరపనున్న విదేశీ పర్యటనల పరంపర వచ్చే రెండు నెలల కాలంలో ప్రారంభం కానుంది. కేవలం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులే లక్ష్యంగా విదేశాలు చుట్టి రానున్న చంద్రబాబు, ఇప్పటి నుంచే అందుకు తగ్గ ప్రణాళికలకు పదును పెడుతున్నారు. 
 
తన పర్యటనల్లో భాగంగా ఆయా కంపెనీల అధిపతులతో భేటీ కావడమే కాక, ఏపీలో ఏ తరహా సౌకర్యాలు అందించనున్నారు. ఏ మేరకు రాయితీలు అందనున్నాయన్న విషయాలపై ఆయన రోడ్డు షోలు నిర్వహించేందుకు కూడా సిద్ధపడుతున్నట్లు సమాచారం. 
 
తన పర్యటనల్లో భాగంగా చంద్రబాబు చైనా, జపాన్, సింగపూర్, మలేసియా తదితర దేశాల్లో తొలిదశ పర్యటన జరపనున్నారు. దీనిపై అధికార బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో మొదలు కానున్న రెండో దశ పర్యటనల్లో భాగంగా చంద్రబాబు అమెరికాలో పర్యటించనున్నట్లు సమాచారం.