ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ మహేష్ బాబు ? బాబు యోచన.. ఏం చేస్తారో?
మహేష్ బాబు అభిమానులకో శుభవార్త. ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగనున్నారట. ఇప్పటివరకు సినిమాల్లో, ప్రకటనల్లో దూసుకుపోతున్న మహేష్ బాబు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా నియమితమవుతారని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి టెన్నిస్ తార సానియా మీర్జా బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైన తరుణంలో ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని ఎంపిక చేద్దామా అంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఆలోచనలో పడ్డారట.
అంతేకాదు.. ఓ నిర్ణయానికి కూడా వచ్చేశారట. తప్పకుండా ఏపీ అంబాసిడర్గా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబునే నియమించాలనుకుంటున్నారట. మరి ఇందుకు మహేష్ బాబు పచ్చజెండా ఊపాడో లేదో తెలియదు కానీ మహేష్ మాత్రం ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ అయితే ఇంకేముంది.. అదిరిపోద్దని అభిమానులు హ్యాపీగా ఉన్నారట.
కాగా ఇప్పటికే గుజరాత్కు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఢిల్లీకి అక్షయ్ కుమార్, కేరళకు మోహన్ లాల్ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్గా సెలక్ట్ అయిన సానియా మీర్జా ప్రమోషన్ త్వరలో ప్రారంభం కానుంది.
తెలంగాణకు ఇంటర్నేషనల్ అప్పీల్ తెచ్చేందుకు.. సానియా పాపులారిటీ తెలంగాణకు ప్లస్ అవుతుందని రాజకీయ పండితులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని ఎంపిక చేద్దామని బాబు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. హీరోయిన్ను ఎంచుకుందామా? హీరోను ఎంచుకుందామా?.. సినీ ఆర్టిస్టులైతా బెటరా? వారికి నేషనల్ స్థాయిలోనైనా పేరుందా ? అనే కోణాల్లో బాబు సర్కార్ యోచిస్తోంది.
ఇంకా బ్రాండ్ అంబాసిడర్ రేసులో ఇప్పటికే పవన్ కల్యాణ్, బాలయ్య బాబు, ఎన్టీఆర్తో పాటు మహేష్ బాబు కూడా ఉన్నారు. అలాగే ఎన్నారై ప్రముఖులను సైతం బరిలోకి దించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. అయితే అత్యధికంగా మహేష్ బాబునే ఏపీకి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికవుతారని తెలుగు తమ్ముళ్లు సైతం అంటున్నారట.