శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (12:01 IST)

కేంద్రంతో సన్నిహితంగా ఉండటం నా స్వార్థం కాదు : చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండటం వెనుక నా స్వార్థం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మంగళవారం సభలో మాట్లాడుతూ... విభజన చట్టంలోని పలు సెక్షన్లలో ఒకదానితో ఒకటికి పొంతన లేదన్నారు. సెక్షన్ 9 ఇంకా పరిష్కారం కాలేదని, సెక్షన్ 10లో ఇంకా సమస్యలున్నాయన్నారు. 
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సయోధ్యగా ముందుకు వెళ్లాలని, మన మధ్య సమస్యలు పరిష్కారం కాకపోతే కేంద్రం వద్దకు వెళదామని కూడా తెలంగాణకు చెప్పానన్నారు. తన వైపు ధర్మం ఉంది కాబట్టి ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడేందుకు ఎప్పుడూ ముందుంటామన్నారు. 
 
కేవలం ప్రత్యేక హోదా కాదని అన్ని హక్కుల కోసం పోరాడాలని కోరారు. గతంలో ప్రధాని ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి లేఖ ఇచ్చానన్న సీఎం, అందులో మొట్టమొదట కోరింది ప్రత్యేక హోదాపైనే అని వెల్లడించారు. ప్రధానిని ఇటీవల కలిసినప్పుడు ఆయనకు అన్ని విషయాలు వివరించానన్నారు.