మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 29 మార్చి 2015 (15:10 IST)

పట్టిసీమతో రాయలసీమ కరవు దూరం : ముఖ్యమంత్రి చంద్రబాబు

పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమ కరవు దూరమవుతుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన ఆదివారం పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి నేటి మధ్యాహ్నం ఆయన శంకుస్థాపన చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో నాలుగేళ్ళలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. అంతకన్నా ముందే పట్టిసీమ పూర్తి చేసి ఆ నీటిని కృష్ణా, గుంటూరు జిల్లాలకు అందించడం ద్వారా కృష్ణా నది నీటిని ఆదా చేసి, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మరింత నీరు రాయలసీమకు తరలిస్తామన్నారు.
 
రాయలసీమను రతనాల సీమగా మరోసారి నిలిపేందుకు ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుందన్నారు. రూ.1300 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు పూర్తి అయితే మొత్తం 8 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో సీమ కరవును దూరం చేస్తామని హామీ ఇచ్చారు.