శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (17:49 IST)

అనంతపురం జిల్లాలో ప్రతి ఎకరాకు నీళ్ళందించడమే నా లక్ష్యం... చంద్రబాబు

అనంతపురం జిల్లాలో ప్రతి ఎకరాకు నీరందించడమే తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. కరవుకు నిలయంగా ఉన్న జిల్లా సస్యశ్యామలం కావాలంటే పట్టిసీమ పూర్తి కావాల్సిందేనని ఆయన తెలిపారు. శుక్రవారం అనంతపురం జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతుల అప్పును తన భుజాలపై వేసుకొని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. 
 
లక్ష్యాన్ని సాధించేవరకు మళ్లీమళ్లీ జిల్లా పర్యటనకు వస్తానన్న ఆయన ఎవరూ చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. పేదవారి ఇంటికి పెద్ద కొడుకులా వుండి కష్టపడతానని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇంతటి ఆర్థిక సంక్షోభంలోనూ పింఛన్లు, రుణమాఫీలు చేస్తున్నామని చెప్పారు.