గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2015 (17:27 IST)

చర్లపల్లి జైలులో రామలింగరాజు సోదరులు టి-20 మ్యాచ్ ఆడారా?

సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ఏడేళ్ళ జైలుశిక్ష పడిన బైర్రాజు రామలింగరావు, ఆయన సోదరుడు బి. రామరాజులు చర్లపల్లి జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. అయితే, ఖైదీల అంతర్జాతీయ క్రీడోత్సవాలను పురస్కరించుకుని బుధవారం చర్లపల్లి జైల్లో ఖైదీల మధ్య ఆటల పోటీలు జరిగాయి. 
 
ఈ క్రీడల్లో భాగంగా ఖైదీలు టీ20 క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. చర్లపల్లి, వరంగల్ జైలు ఖైదీల జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌‌లో వరంగల్ జట్టు విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యచ్‌ను జైల్లోని మొత్తం 943 మంది ఖైదీలు ఆసక్తిగా వీక్షించారు. 
 
అయితే, సత్యం కంప్యూటర్స్ కేసులో దోషులుగా తేలి ఇటీవలే జైలుకు వెళ్లిన రామలింగరాజు అండ్ కో మాత్రం ఈ మ్యాచ్‌ను చేసేందుకు బయటకు రాలేదని జైలు వర్గాలు పేర్కొంటున్నాయి. వీరంతా తమకు కేటాయించిన బ్యారక్ లకే పరిమితమయ్యారట.