శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 18 జనవరి 2017 (11:46 IST)

ఈజిప్టులో హత్య.. కడపలో శిక్ష.. ఎలా జరిగింది?

దేశం కాని దేశంలో హత్య చేసిన ఓ మహిళకు ఆ దేశంలో కోర్టు శిక్ష విధించింది.. అయితే ఆమె సొంత దేశంలో శిక్షను అనుభవించే అవకాశం ఉండటంతో ఆమెను భారతదేశానికి పంపించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆ మహిళను మంగళవారం

దేశం కాని దేశంలో హత్య చేసిన ఓ మహిళకు ఆ దేశంలో కోర్టు శిక్ష విధించింది.. అయితే ఆమె సొంత దేశంలో శిక్షను అనుభవించే అవకాశం ఉండటంతో ఆమెను భారతదేశానికి పంపించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆ మహిళను మంగళవారం కడప కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే...
 
చిత్తూరు జిల్లా కేవీ.పల్లెకు చెందిన నాగమునెమ్మ అలియాస్‌ నాగమణి (45) జీవనోపాధి కోసమని కొన్నేళ్ల క్రితం గల్ఫ్‌కు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈజిప్టులో ఆమెకు తెలిసిన వారు ఉంటే గల్ఫ్‌ నుంచి ఈజిప్టు దేశానికి వచ్చింది. అక్కడ ఆమె ఓ హత్య కేసులో అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుంది. 
 
దీంతో ఆమెను ఈజిప్టు పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా ఆమెకు జీవిత ఖైదు శిక్ష విధించారు. కానీ ప్రస్తుతమున్న చట్టాల్లో వెలుసుబాటు వల్ల నిందితురాలు సొంత ఊళ్లొనే జైలు శిక్ష అనుభవించవచ్చు. 
 
ఈ విషయాన్ని కోర్టు దృష్టికి ముద్దాయి తరపు న్యాయవాది తీసుకెళ్లడంతో ఈజిప్టు కోర్టు మన్నించి చిత్తూరు జైల్లో శిక్ష అనుభించేందుకు సమ్మతించింది. దీంతో ఆమె చిత్తూరు జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసులో ఆమె 2025లో విడుదలవుతారని జైలు అధికారులు తెలిపారు.