శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 5 జులై 2015 (13:58 IST)

ప్రవాసుల కోసం ఏపీలో ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తానా మహాసభలను పురస్కరించుకుని అమెరికాలోని ప్రవాసాంధ్రులకు వీడియో సందేశాన్ని పంపారు. విదేశాల్లో స్థిరపడిన వారంతా పెట్టుబడులతో తెలుగు రాష్ట్రాలకు తరలిరావాలని చంద్రబాబు కోరారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలను ఏకం చేయడంలో తానా విశేష కృషి చేస్తోందని చెప్పిన చంద్రబాబు, విదేశాల్లో తెలుగు జాతి కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేయాలని పిలుపునిచ్చారు.
 
తెలుగు రాష్ట్రాల్లోని అవకాశాలను అందిపుచ్చుకోవడమే కాక ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేలా చర్యలు చేపట్టాలని కూడా చంద్రబాబు కోరారు. ప్రవాసుల కోసం ఏపీలో ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ప్రవాస ఐటీ నిపుణులు రాష్ట్రం గురించి వారంలో కనీసం 5 గంటల నుంచి 10 గంటలైనా ఆలోచించాలన్నారు. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు. అందులో ప్రవాసాంధ్రుల పాత్ర కీలకమని అభిప్రాయపడ్డారు.