శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2015 (12:25 IST)

కడపలో నేను జగన్ రాజకీయ ప్రత్యర్థులం : సీఎం రమేష్

కడప జిల్లాలో మేమిద్దరం రాజకీయ ప్రత్యర్థులం... నాకు జగన్‌ మోహన్ రెడ్డితో మాట్లాడాల్సిన అవసరమేముందని టీడీపీ యువనేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తంచేశాడు. విద్యుత్ ఉద్యోగుల వేతనాల విడుదలకు సంబంధించి తాను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడానన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. జగన్‌తో మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. 
 
‘నాకు జగన్‌తో మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? కడప జిల్లాలో మేం రాజకీయ ప్రత్యర్థులం. ఆయనకు నేను ఫోన్ చేయలేదు. మాట్లాడలేదు. కొంతకాలం కిందట విద్యుత్ ఉద్యోగులు నన్ను ఢిల్లీలో కలిశారు. నాతో పాటు మిగిలిన ఎంపీలను కలిశారు. వారిని వెంట తీసుకుని కేంద్ర హోం శాఖ మంత్రి వద్దకు వెళ్లి ఆయనకు సమస్య వివరించాం. ఆ తర్వాత వారెవరూ నా దగ్గరకు రాలేదు. నేనెవరికీ ఫోన్ చేయలేదు. మేం అధికారంలో ఉన్నాం. జగన్ ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయనకు నేనెందుకు ఫోన్ చేస్తాను?’’ అని ఆయన విలేఖరులకు వివరించారు.