శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 జనవరి 2016 (10:01 IST)

కోయంబత్తూరులో బిడ్డకు జన్మనిచ్చిన పదో తరగతి విద్యార్థిని!

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఓ ఆటో డ్రైవర్‌తో ఉన్న వివాహేతర సంబంధం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కోవై ఉడుమలై ప్రాంతానికి చెందిన 16 యేళ్ళ బాలిక... స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇదేప్రాంతానికి మురుగన్ (26) అనే ఆటో డ్రైవర్‌తో ఈ విద్యార్థిని వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ పరిచయం మూడేళ్లుగా కొనసాగుతూ.. వీరిద్దరు హద్దులు దాటి ప్రవర్తిస్తూ వచ్చారు.
 
ఈ క్రమంలో గత ఆదివారం తీవ్రమైన విద్యార్థినికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో ఆమె తల్లిదండ్రులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా... నిండు గర్భిణి అని వైద్యులు చెప్పారు. ఇంతలో సోమవారం ఉదయం ఆ విద్యార్థిని పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 
 
ఆ తర్వాత విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో ఉన్న ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.