గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2016 (20:08 IST)

నయీంతో హత్య చేయించేందుకు కుట్ర : ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీంతో తనను, తన అన్నను హత్య చేయించేందుకు కుట్ర జరిగినట్టు ఆరోపణలు చేశార

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీంతో తనను, తన అన్నను హత్య చేయించేందుకు కుట్ర జరిగినట్టు ఆరోపణలు చేశారు. ముఖ్యంగా తాను గతంలో ఎమ్మెల్సీగా పోటీలో నిలబడినప్పుడు పోటీలోంచి తప్పుకొమ్మని నయీం ఒత్తిడి చేశాడని, నయీం మనుషులు తనను బెదిరించారని ఆయన వెల్లడించారు. అందువల్లే నయీం కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
గతంలో నల్లగొండ జిల్లాలో నయీం ముఠా ఆగడాల గురించి తాము నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్ళగా, ఆయన ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. తాము ఇంకా పట్టుబడితే నయీంకు చెప్పి తమను హత్య చేయించేవారేమోనని అనుమానం వ్యక్తం చేశారు.
 
తాను ఎంపీగా ఉన్నప్పుడు కూడా నయీం ముఠా నుంచి బెదిరింపులు వచ్చాయి గానీ వాటిని తాను పట్టించుకోలేదన్నారు. ఇక టీఆర్ఎస్ నాయకులైతే.. నయీం ముఠాతో బెదిరించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీటీసీల నుంచి నాయకులందరినీ టీఆర్ఎస్‌లో చేర్పించారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చాలామంది టీఆర్ఎస్‌లో చేరారని, నయీం వల్ల లబ్ధి పొందినవాళ్లలో 90 శాతం మంది ఇప్పుడు టీఆర్ఎస్‌లో ఉన్నారని గుర్తుచేశారు.