శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 27 మే 2015 (07:55 IST)

మీరేందిరా.. కొట్టుకునేది.. నేనే కొడతా..! విద్యార్థి చెయ్యి విరిచిన కరస్పాండెంట్

విద్యార్థులు ఉన్నచోట గొడవలు సర్వసాధారణం. వారు గ్రూపులు కట్టడం. ఘర్షణకు దిగడం సహజం. అయితే వారిని మందలించి తిరిగి పంపుతుంటారు. అయితే ఇంజనీరింగ్ కాలేజీలో రెండు ముఠాలు గొడవ పడడం ఓ కరస్పాండెంట్ కు ఎనలేని కోపం తెప్పించింది. మీరేందిరా కొట్టుకునేది. నేనే మీ అందరిని కొడతానంటూ విద్యార్థులపై దాడికి దిగాడు. ఈ దాడిలో ఓ విద్యార్థి చెయ్యి విరిగింది. వివరాలిలా ఉన్నాయి. 
 
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. ఈ కాలేజీలో ట్రిపుల్-ఇ 3వ సంవత్సరం చదువుతున్న కొందరు విద్యార్థులు గొడవపడ్డారు. దీంతో ఆగ్రహం చెందిన కరెస్పాండెంట్ వసంత్ కుమార్ 30 మంది విద్యార్థులను చితకబాదాడు. విచక్షణ కోల్పోయి జరిపిన దాడిలో శ్రీనివాస్ అనే విద్యార్థి చెయ్యి విరిగింది. అతనిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.