శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 26 జనవరి 2015 (13:00 IST)

అప్పుల బాధ తాళలేక దంపతుల ఆత్మహత్య!

అప్పుల బాధ తాళలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరులో చోటుచేసుకుంది. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. 
 
గ్రామానికి చెందిన సాంబశివ రావు(49), భార్య కోటేశ్వరమ్మ నాలుగు ఎకరాల్లో మిరప, పత్తి పంట సాగు చేశారు. ఆయన ఆశించిన స్తాయిలో దిగుబడి రాలేదు. 
 
పంటల కోసం సాంబశివరావు రూ.4 లక్షలు పైగా అప్పు చేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.