శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 25 ఏప్రియల్ 2015 (13:33 IST)

వివాహేతర సంబంధం... బాపట్లలో పురుగుల మందు తాగి జంట సూసైడ్

వివాహేతర సంబంధం కారణంగా ఓ జంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో జరిగింది. వివరాలను చూస్తే.. మాచర్లకు చెందిన శ్రీనివాసరావు బాపట్లలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తూ అదే మండలంలోని జమ్ములపాలేనికి చెందిన ఝాన్సీతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఏమైందో తెలియదు కానీ వీరిరువురు కలిసి పొలాల్లో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. శనివారంనాడు ఉదయం పొలాల్లో పనులకు వెళ్లిన వారు మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు, శుక్రవారం నాడే ఈ జంట ఆత్యహత్యకు పాల్పడినట్టు గుర్తించారు. సంఘటన స్థలంలో పడివున్న సూసైడ్ నోట్ ను పరిశీలించిన పోలీసులు వారి మరణానికి కారణం వివాహేతర సంబంధమేనని భావిస్తున్నారు.