బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 10 జూన్ 2017 (16:29 IST)

ఆ ముగ్గురూ మూడు కోతులు.. జగన్‌కు ఓవరాక్షన్ చేయడం తప్ప మరేమీ తెలియదు!

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు ఓవారక్షన్ చేయడం మినహా మరేమీ తెలియదని తేల్చిపారేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుత

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు ఓవారక్షన్ చేయడం మినహా మరేమీ తెలియదని తేల్చిపారేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తే అధోగ‌తి పాల‌వుతారు త‌ప్పా మ‌రేమీ మిగ‌ల‌బోద‌ని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో చంద్ర‌బాబు, కేసీఆర్‌, జ‌గ‌న్‌ మూడు కోతుల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వారు ముగ్గురూ ఒక దేవుడిలా చూస్తున్నార‌ని, ఢిల్లీకి వెళ్లి మోడీ ముందు భ‌క్తి, గౌర‌వాల‌తో మాట్లాడుతున్నార‌ంటూ పేర్కొన్నారు. 
 
మ‌హాత్మ గాంధీ మూడు కోతుల గురించి చెప్పార‌ని, అందులో ఒక కోతి విన‌దు, మ‌రొక‌టి మాట్లాడ‌దు, ఇంకోటి చూడ‌దు అని అన్నారు. ప్రధాని మోడీ వద్ద ఈ ముగ్గురూ ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. జ‌గ‌న్ ఛాంబ‌ర్‌లోకి నీళ్లు వ‌చ్చాయంటూ టీడీపీ, వైసీపీ నేత‌లు ఒకరిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నార‌ని, రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై మాట్లాడకుండా, భ‌వ‌నంలోకి నీళ్లొచ్చాయి, ఛాంబ‌ర్‌లోకి నీళ్లొచ్చాయి అంటూ వాదించుకోవ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ ఓవ‌రాక్ష‌న్ ఆపేయాల‌ని ఆయ‌న సూచించారు. లక్ష్మీపార్వ‌తి, శ‌శిక‌ళ ఓవ‌ర్ యాక్ష‌న్‌తోనే న‌ష్ట‌పోయార‌ని, జ‌గ‌న్ కూడా అలాగే న‌ష్ట‌పోతార‌ని నారాయణ హితవు పలికారు.