గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (12:47 IST)

టీడీపీ ఎంపీలు.. మంత్రులు రాజీనామా చేస్తే గంటలో ప్రత్యేక హోదా : సీపీఐ

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా చేస్తే గంటలో ప్రత్యేక హోదా వస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
 
తాము రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందంటే తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు టీడీపీ రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ అన్నారు. అయితే, బెదింపులకు కేంద్రం తలొగ్గే ప్రసక్తే లేదని, ఆ పరిస్థితిలో కేంద్రం లేదని ఆయనే సమాధానిచ్చారు.
 
దీనిపై రామకృష్ణ సోమవారం మాట్లాడుతూ ఎంపీలు రాజీనామా చేస్తే గంటలో ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్నారు. పార్లమెంటులో పదిరూపాయలకే బిర్యానీ తింటున్న ఎంపీలు రాష్ట్రాన్ని పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 11న రాష్ట్ర బంద్‌ చేపట్టనున్నట్లు రామకృష్ణ తెలిపారు.