శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 21 అక్టోబరు 2014 (19:13 IST)

మచిలీపట్నంలో బాణసంచా పేలుడు... ఒకరి మృతి... ఇద్దరు విషమం

తూర్పుగోదావరి జిల్లా బాణసంచా పేలుడు విషాద ఘటన అలా ఉండగానే మళ్లీ కృష్ణాజిల్లా మచిలీపట్నంలో బైపాస్ రోడ్డు వద్ద ఉన్న ఓ ఇంట్లో బాణాసంచా పేలుడు సంభవించి కిరణ్ అనే యువకుడు మృతి చెందాడు. 
 
అనధికారకంగా ఓ ఇంట్లో తాటాకు బాంబులు, ఉల్లిపాయ బాంబులు తయారు చేస్తున్న ఓ కుటుంబం బాణాసంచా పేలుడికి తీవ్రగాయాలతోపాటు యువకుడిని పోగొట్టుకుంది. ఈ ఘటనలో తులసి, నాగలక్ష్మి అనే ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెపుతున్నారు.