శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: సోమవారం, 27 ఏప్రియల్ 2015 (21:34 IST)

క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళ అరెస్టు..

అనంతపురం జిల్లాలో చాలా కాలంగా బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. తాడిపత్రి, కదిరి ప్రాంతాలలో మట్కా,క్రికెట్ బెట్టింగులు షరామామూలే, నిన్నటి దాకా ప్రపంచ కప్ బెట్టింగులతో నానా హంగామా చేస్తే.. ప్రస్తుతం బెట్టింగు రాయుళ్ళు ఐపిఎల్ లో తెగ జోరుగా బెట్టింగులు చేస్తున్నారు. తాజాగా తలుపుల మండలంలో పోలీసుల దాడిలో బెట్టింగు రాయుళ్ళు పట్టుబడ్డారు. 
 
తలుపుల మండలంలో 9మంది ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్లను అరెస్టు చేసినట్లు ఎస్సై గోపాలుడు తెలియజేశారు. వారి నుంచి రూ.21,300 నగదు స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులను సోమవారం కదిరి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు.