బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 2 ఆగస్టు 2015 (16:38 IST)

ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని బీజేపీ చెప్పలేదు : పురంధేశ్వరి

గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని బీజేపీ అధిష్టానం చెప్పలేదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత పురంధేశ్వరి గుర్తు చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రణాళికా మంత్రి రావు ఇంద్రజితి సింగ్ చెప్పడంపై ఆమె స్పందిస్తూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వెనక్కి పోలేదన్నారు. 
 
సాంకేతికపరమైన కారణాలతోనే హోదా ఇవ్వలేకపోతోందన్నారు. హోదా ఇవ్వలేకపోయినా ఆ స్థాయిలో రాష్ట్రానికి సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరంలేదని 14వ ఆర్థికసంఘం సిఫారసు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు అడిగినా ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, నిధులు తెచ్చుకునే విషయంలో రాష్ట్రం మరింత చొరవ చూపాలని ఆమె హితవు పలికారు.