గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2017 (16:58 IST)

సైకో వెంకటేశ్వర్లుకు ఉరిశిక్ష : నెల్లూరు కోర్టు తీర్పు

నెల్లూరు జిల్లాలో వరుస హత్యలకు పాల్పడిన సైకో కిల్లర్‌కు జిల్లా కోర్టు కఠినశిక్షను విధించింది. సైకో వెంకటేశ్వర్లుకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు గురువారం సంచలనాత్మకమైన తీర్పును వెలువరించి

నెల్లూరు జిల్లాలో వరుస హత్యలకు పాల్పడిన సైకో కిల్లర్‌కు జిల్లా కోర్టు కఠినశిక్షను విధించింది. సైకో వెంకటేశ్వర్లుకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు గురువారం సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది. 
 
2016లో హరినాథపురంలో ఆడిటర్ భార్య ప్రభావతితో పాటు, పూజారి దంపతులను వెంకటేశ్వర్లు సుత్తితో కొట్టి అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెల్సిందే. ఈ కేసు విచారణలో భాగంగా నేరం రుజువు కావడంతో, కోర్టు గురువారం తుది తీర్పును వెలువరించింది. సైకో వెంకటేశ్వర్లుకు ఉరిశిక్షను ఖరారు చేసింది.