గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 5 జులై 2015 (10:59 IST)

మహిళా ఉద్యోగిపై వేధింపులు: ఆర్డీఓ నాగరాజు సరెండర్

మహిళా ఉద్యోగిపై ఆర్డీఓ వేధింపులకు పాల్పడిన ఆర్డీఓ సరెండర్ అయ్యారు. అనంతపురం జిల్లా ధర్మవరం రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)గా పనిచేస్తున్న నాగరాజు విధి నిర్వహణను మరిచి మహిళా ఉద్యోగిపై వేధింపులకు పాల్పడ్డాడు. తన పరిధిలోని గ్రామానికి వీఆర్ఏగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 
 
బాధితురాలి ఫిర్యాదుతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ కోన శశిధర్, నాగరాజును ప్రభుత్వానికి సరెండర్ చేసేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్, డీఆర్ఓలతో కూడిన కమిటీతో నాగరాజుపై కలెక్టర్ విచారణ చేయించారు. ఈ విచారణలో బాధితురాలి ఆరోపణ నిజమేనని తేలడంతో నాగరాజును ప్రభుత్వానికి సరెండర్ చేశారు.