శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (15:28 IST)

జంగారెడ్డిగూడెంలో ఫైనాన్షియర్ దంపతులను గొడ్డలితో నరికి చంపేశారు!

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఫైనాన్షియర్ దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపేశారు. గురువారం అర్థరాత్రి జరిగిన ఈ జంట హత్యలు స్థానికంగా కలకలం సృష్టించింది. విజయ పేరుతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న లక్ష్మణరావును కొంతమంది దుండగులు పెట్రోల్ బంక్ సమీపంలో అడ్డగించి గొడ్డలితో నరికారు. 
 
తన భర్తకు జరిగిన ప్రమాదాన్ని పసిగట్టిన ఆయన భార్య తులసి.. హంతకులను అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఆమెను కూడా వారు నరికి చంపేశారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనలు గురయ్యారు. 
 
ఈ జంట హత్యలకు పాత కక్షలే ప్రధాన కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. దీనిపై సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణం గురువారం అర్థిరాత్రి దాటాక జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.