భార్యపై అనుమానంతో దారుణంగా నరికి చంపిన భర్త
చిత్తూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. భార్యపై గత కొన్ని నెలలుగా అనుమానం పెట్టుకున్న భర్త ఒక్కసారిగా భార్యపై దాడి చేసి దారుణంగా కొట్టి చంపేశాడు. మదనపల్లి మండలం నక్కలదిన్నెలో పద్మావతి, వెంకటరమణ నాయక్లు నివాసముంటున్నారు. వెంకరమణ నాయక్ స్థానికంగా ఆటో
చిత్తూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. భార్యపై గత కొన్ని నెలలుగా అనుమానం పెట్టుకున్న భర్త ఒక్కసారిగా భార్యపై దాడి చేసి దారుణంగా కొట్టి చంపేశాడు. మదనపల్లి మండలం నక్కలదిన్నెలో పద్మావతి, వెంకటరమణ నాయక్లు నివాసముంటున్నారు. వెంకరమణ నాయక్ స్థానికంగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
గత కొన్ని నెలలుగా పద్మావతిపై అనుమానంతో ఉన్నాడు వెంకరమణ. దీంతో మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో పద్మావతి ఇంటి ఆవరణలో నిద్రిపోతుండగా ఆమెపై దాడికి దిగాడు. ఇటుకరాయితో తలపై గట్టిగా కొట్టి చంపేసి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమివ్వగా అప్పటికే పద్మావతి మృతి చెందింది. నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.