గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (11:54 IST)

2015 మే 9,10,11 తేదీల్లో డీఎస్సీ పరీక్షలు: మంత్రి గంటా ప్రకటన

2015 మే 9,10,11 తేదీల్లో డీఎస్సీ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకోసం డీఎస్సీ-2014 నోటిఫికేషన్‌ షెడ్యూలుని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. 
 
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాస్‌రావు ప్రకటించారు. మొత్తం 9,061 పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదలవుతుందన్నారు. 
 
స్కూల్‌ అసిస్టెంట్‌ 1,849 పోస్టులు, ఎస్‌జీటీ 6,244 పోస్టులు, లాంగ్వేజ్‌ పండిట్‌ 812 పోస్టులు, పీఈటీ 156 పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనునన్నట్లు చెప్పారు.
 
గురువారం ఏపీ సచివాలయంలో మంత్రి గంటా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. ప్రతీ సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.