గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2016 (10:43 IST)

తిరుపతిలో ఆకట్టుకుంటున్న ప్రత్యేక హోదా వినాయకుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హోదా వినాయకుడు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. డి.ఆర్.మహల్‌ సమీపంలో ఈ ప్రత్యేక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హోదా వినాయకుడు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. డి.ఆర్.మహల్‌ సమీపంలో ఈ ప్రత్యేక హోదా వినాయకులను ఏర్పాటు చేశారు. 
 
పార్లమెంటులో సభ్యులందరూ ప్రత్యేక హోదాకు ఆమోదం తెలపాలంటూ ప్లకార్డులను చేతపట్టుకుని వున్న వినాయకులను ఏర్పాటు చేశారు. ఈ వైరైటీ వినాయకులను చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. 
 
మరోవైపు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అతిపెద్ద నారికేళ వినాయకున్ని ఏర్పాటు చేశారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ వినాయకున్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.