గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 3 జులై 2017 (13:45 IST)

పుట్టిన రోజే చివరి రోజు... అమెరికాలో తెలుగు ఇంజనీర్ దుర్మరణం

అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తెలుగు ఇంజనీర్ ఒకరు దుర్మరణం పాలయ్యాడు. అదీకూడా తను పుట్టిన రోజే చనిపోవడం గమనార్హం. మిత్రులతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకుని తిరుగు ప్రయాణమైన ఆ ఇంజనీర్... రోడ్డు

అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తెలుగు ఇంజనీర్ ఒకరు దుర్మరణం పాలయ్యాడు. అదీకూడా తను పుట్టిన రోజే చనిపోవడం గమనార్హం. మిత్రులతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకుని తిరుగు ప్రయాణమైన ఆ ఇంజనీర్... రోడ్డు ప్రమాదం కబళించింది. ఈ విషాదకర ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆదివారం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బాహార్‌పేటకు చెందిన పి.మురళి - వనజ దంపతుల ఏకైక కుమారుడు ప్రదీప్‌ (30) అమెరికా, నార్త్‌ కరోలీనాలోని డెల్‌ కంపెనీలో ఎనిమిదేళ్ల ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. హైదరాబాద్‌ అంబర్‌పేటకు చెందిన కీర్తనతో 16 డిసెంబర్‌ 2015న ప్రదీప్‌ వివాహమైంది. ఆదివారం తన 30వ పుట్టిన రోజును ఉత్సాహంగా జరుపుకునేందుకు భార్య కీర్తన, మరో 8 మంది స్నేహితులతో కలిసి వెస్ట్‌ వర్జీనియాలోని సుటూన్‌ లేక్‌ వెళ్లాడు. 
 
అక్కడ వేడుకలు జరుపుకుని తిరిగి వస్తుండగా, కాల్నిఫోరియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రదీప్‌ అక్కడికక్కడే మృతి చెందగా అతని భార్య కీర్తన తీవ్రంగా గాయపడ్డారు. అదే వాహనంలో ఉన్న రవి, ప్రణీతదేవ జంటతో పాటు, మరో ఇద్దరు గాయపడినట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆదివారం రాత్రి కీర్తన భువనగిరిలోని ప్రదీప్‌ తండ్రి మురళికి ఫోన్‌ చేసి చెప్పింది.