మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (11:42 IST)

కావలిలో ఇంజనీరింగ్ విద్యార్థిని సూసైడ్.. హెయిర్ కలర్ సేవించి..

నెల్లూరు జిల్లా కావలిలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థిని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. హెయిర్ కలర్ రంగును తాగి ఈ దారుణానికి పాల్పడింది.
 
ఈ విద్యార్థిని పేరు భారతిగా గుర్తించారు. అర్థరాత్రి హాస్టల్ గదిలో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తలకు వేసుకునే రంగుని తాగి ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం విద్యార్ధిని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్ధిని మృతి చెందింది. ఈ విద్యార్థిని స్వగ్రామం... ఉదయగిరి మండలం కొండారెడ్డి పాలెం. అయితే, మృతురాలి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.