శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (10:42 IST)

వంట గ్యాస్‌ లీక్... అగ్ని ప్రమాదంలో విశ్రాంత ఉద్యోగి మృతి

వంట గ్యాస్ లిక్ కావడంతో సంభవించిన అగ్ని ప్రమాదంలో విశ్రాంత ఉద్యోగి మృతి చెందారు. శ్రీనగర్ కాలనీలోని పద్మజ అపార్టుమెంట్ ప్లాట్ నెంబరు 201లో ఐబీ విభాగం విశ్రాంత ఉద్యోగి ఎస్.ఎస్ మూర్తి (84) ఆయన భార్య విజయలక్ష్మి నివాసముంటున్నారు. 
 
ఎప్పటిలాగే గురువారం వేకువజామున మూర్తి పాల ప్యాకెట్ తీసుకువచ్చి పాలు కాచేందుకు వంట గదిలోకి వెళ్లి పొయ్యి వెలిగించారు. పొయ్యి మీద పాలు వేడి చేస్తుండగా అకస్మాత్తుగా జరిగిన అగ్ని ప్రమాదంలో మూర్తి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. 
 
భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ మోహన్ కుమార్, ఎస్సై లింగా రెడ్డి తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృత దేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో వంట గ్యాస్‌ లీక్ కావడంతో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలిసిందని వెల్లడించారు.