శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2016 (12:17 IST)

మాజీ ఎమ్మెల్యే‌ కొడుకుపై మహిళ ఫిర్యాదు... పెళ్లి చేసుకుని వాడుకుని వదిలేశాడు

డప మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి కుమారుడు చంద్ర ఓబుల్‌రెడ్డి అలియాస్‌ నానిపై ఓ మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చినట్టు నమ్మించి తనను పెళ్లి చేసుకుని... కొద్ది ర

కడప మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి కుమారుడు చంద్ర ఓబుల్‌రెడ్డి అలియాస్‌ నానిపై ఓ మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చినట్టు నమ్మించి తనను పెళ్లి చేసుకుని... కొద్ది రోజుల పాటు కాపురం జరిపి వదిలివేశాడని పుత్తా వాసంతిరెడ్డి అనే మహిళ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నానితోనే జీవిస్తానని ఆ మేరకు తనకు న్యాయం చేయాలని పోలీసులను అభ్యర్థించింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే... కమలాపురం మండలం సంబటూరుకు చెందిన వాసంతిరెడ్డి ఎంటెక్‌ వరకు చదువుకున్నానని, 2013 నుంచి 2015 వరకు కేఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశానన్నారు. అక్కడ ఉద్యోగం చేస్తుండగా చంద్ర ఓబుల్‌రెడ్డి తన వెంట తిరుగుతూ పరిచయం పెంచుకున్నాడన్నారు. తనకు మాయమాటలు చెప్పి 2015 ఏప్రిల్‌లో తిరుత్తణిలో తామిద్దరం పెళ్లి చేసుకున్నట్టు చెప్పుకొచ్చింది. 
 
అయితే ఆ సమయంలో మేమిద్దరం ఉండడంతో అదే ఏడాది నవంబర్‌ 2న కొంతమంది పెద్దల సమక్షంలో తిరుపతిలో మళ్లీ వివాహం చేసుకున్నట్టు తెలిపింది. వివాహమైన కొన్ని రోజుల వరకు తనతో అన్యోన్యంగా జీవించి తరువాత మా తల్లిదండ్రులు వద్దంటున్నారంటూ తనను వదిలేసి వెళ్లిపోయాడన్నారు. 
 
గత పది నెలలుగా తనతో జీవించేందుకు పెద్దమనుషులతో చెప్పి పంపుతున్నప్పటికీ తన భర్త నుంచి ఎలాంటి సమాచారంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. కాగా, ఈ మహిళ చేసిన ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే శివానందరెడ్డి కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు.