శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (11:41 IST)

ఫాస్ట్ స్కీమ్ ఈజ్ పాస్ట్.. కేసీఆర్.. పాత పద్ధతిలోనే..!

ఫాస్ట్ పథకంపై కేసీఆర్ సర్కార్ వెనక్కి తగ్గింది. ఫీజు బకాయిల చెల్లింపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన వివాదాస్పద ఫాస్ట్ పథకాన్ని విరమించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. పాత పద్ధతిలోనే ఫీజు తిరిగి చెల్లించే పథకాన్ని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 
 
కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ఫీజుల తిరిగి చెల్లింపునకు సంబంధించి నాలుగేళ్ల బకాయిలను గత ప్రభుత్వం తమ నెత్తిన పోసిందని ఆరోపించారు.
 
రూ.1650 కోట్లకు పైగా ఉన్న ఈ బకాయిల్లో ఇంకా రూ.862 కోట్లు చెల్లించాల్సి ఉందని కేసీఆర్ చెప్పారు. వీటిని వెంటనే చెల్లిస్తామని, పేద విద్యార్థులకు సంబంధించింది కాబట్టి ఫాస్ట్‌ను రద్దు చేసి పాత విధానాన్నే కొనసాగిస్తామని వివరించారు.