శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2015 (14:23 IST)

చీకటీగల కోనలో కాల్పులు... కానిస్టేబుల్ మిస్సింగ్... కొనసాగుతున్న కూంబింగ్

శేషాచల అడవుల్లో మరోమారు కాల్పులు జరిగాయి. పోలీసులకు, ఎర్రచందనం స్మగ్లర్లకు మధ్యన పోరాటం జరిగింది. ఇప్పటికీ కూంబింగ్ కొనసాగుతోంది. మధ్యలో కాసేపు కానిస్టేబుల్ ఒకరు తప్పిపోవడంతో పోలీసులు హైరానా పడ్డారు. దాదాపు కోటి రూపాయల విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
తిరుపతి సమీపంలోని శ్రీవారి మెట్టు మార్గం సమీపంలోని చీకటీగల కోన ప్రాంతంలో ఎర్రదొంగలు మరోమారు రెచ్చిపోయారు. దాదాపు కోటి రూపాయల విలువ చేసే ఎర్రచందనం దుంగలను నరికి తీసుకెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం రాత్రి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అదే సమయంలో పోలీసులకు, స్మగ్లర్లకు బీకర పోరు జరిగింది. పోలీసులు కాల్పులు జరిపారు. 
 
ఈ సమయంలో ఓ కానిస్టేబుల్ మిస్సయ్యారు. దీంతో పోలీసులు మరింత హైరానా పడ్డారు. అయితే అరగంట తరువాత పోలీసు తిరిగిన తన బృందంలో చేరారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఎంతమంది గాయపడ్డారనే విషయం తెలియదు. అయితే కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.