శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (09:46 IST)

ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ : ఒకే ఫ్యామిలీలో ఐదుగురి ఆత్మహత్య!

ఈ ఆత్మహత్యలపై స్థానిక పోలీసులు స్పందిస్తూ.. రైల్వే ఉద్యోగి శ్రీనివాసులు కుటుంబం తన కుమార్తె, అల్లుడితో కలిసి ఉంటోంది. అల్లుడు బాబుకు వ్యాపారంలో నష్టాలు రావటంతో ఆ కుటుంబం ఈ ఘటనకు పాల్పడింది. ముందుగా చిన్నారులు నవనీత్, యశశ్రీని గొంతు నులిమి చంపి అనంతరం శ్రీనివాసులు భార్య జయలక్ష్మి, కుమార్తె రాజేశ్వరి, అల్లుడు బాబు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 
 
కాగా శ్రీనివాసులు ఆ సమయంలో ఇంట్లో లేడు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టంకు తరలిస్తున్నారు. ఈ సామూహిక ఆత్మహత్యలతో హౌసింగ్ బోర్డు కాలనీలో విషాదచాయలు అలముకున్నాయి.